Home » ఈ మూవీలో చేసిన కమెడియన్స్ అంతా చనిపోయారు.. మిగిలింది 4గురే.. కారణం తెలిస్తే..!!

ఈ మూవీలో చేసిన కమెడియన్స్ అంతా చనిపోయారు.. మిగిలింది 4గురే.. కారణం తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నవ్వు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు వైద్యులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది కమెడియన్లు మనల్ని ఇంతకాలం నుంచి నవ్వించారు, నవ్విస్తున్నారు కూడా.. అంతేకాకుండా తెలుగు చిత్ర సీమలో కామెడీ చిత్రాలు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే దర్శకుడు ఇవి. సత్యనారాయణ ఒకరు. జనరేషన్ తగ్గట్టు కామెడీ పండించగల గొప్ప డైరెక్టర్.. అలాంటి ఈయన డైరెక్షన్ చేసిన కామెడీ మూవీ ఎవడి గోల వాడిది.. ఈ మూవీలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది కమెడియన్స్ నటించారు. ఇందులో బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మూవీలో నటించిన చాలామంది ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

also read:CSK ఫ్యాన్స్ కు షాక్… ధోని సంచలన నిర్ణయం

Advertisement

మరి చిత్రంలో చేసి కమెడియన్లలో చనిపోయిన వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. చలపతిరావు ఈ సినిమాలో హోటల్ యజమానిగా నటించారు. 2022లో కాలం చేశారు.. అలాగే ఈ చిత్రంలో ప్రధాన కమెడియన్ గా నటించిన జయప్రకాష్ రెడ్డి, బ్యాంకాక్ వెళ్లిన ప్రకాష్ రెడ్డి తెలంగాణ శకుంతలకు భయపడి దాక్కొని, తీరా ఆమె అక్కడికి వచ్చాక ఆమె నుంచి తప్పించుకోవడానికి పడే పాట్లు, ఇది తెలిసి తన అన్నగా నటించిన కొండవలస తమ్ముడికి ధైర్యం చెబుతూ చేసే కామెడీ మర్చిపోలేం. ఇలా ఈ ముగ్గురు ప్రస్తుతం ఇండస్ట్రీలో కాలం చేశారు. జయప్రకాశ్ రెడ్డి 2020లో కన్నుముయ్యగా,కొండవలస 2015లో , తెలంగాణ శకుంతల 2014లో చనిపోయారు.

Advertisement

also read:ప్రభాస్ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం!

అంతేకాకుండా మరో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈయన 2013లో కాలం చేశారు. అలాగే మరో కమెడియన్ మల్లికార్జున రావు కూడా 2008లో కాలం చేశారు. అలాగే మరో స్టార్ కమెడియన్ లక్ష్మీపతి కూడా 2008లో కాలం చేశారు. అలాగే ఈ మూవీలో హీరో తండ్రి పాత్రలు చేసిన ఏవీఎస్ కూడా కాలం చేశారు. అంతేకాదు ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఈ.వి. సత్యనారాయణ కూడా పరమపదించారు. ఈ విధంగా ఈ సినిమాలో చేసిన చాలామంది కమెడియన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరు.

also read:

Visitors Are Also Reading