Home » Prabhas : భద్రాద్రి రాముడు ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం…

Prabhas : భద్రాద్రి రాముడు ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం…

by Bunty

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమధ్య కాలంలో ప్రభాస్ కు మంచి హిట్ లేదు. ఇక ప్రభాస్ సాహో, రాదేశ్యామ్ సినిమాల తర్వాత ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలను అందుకుంది ఆది పురుష్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్స్ ను మార్చేయనున్నారట.

ఈ నేపథ్యంలో ఈ సినిమా జూన్ 16, 2023కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓంరౌత్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రామాయణం, ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముని పాత్ర పోషించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం అందించారు.

ఈ మేరకు ప్రభాస్ తరపున యువి క్రియేషన్స్ ప్రతినిధులు రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈవో రమాదేవికి శనివారం అందించారు. అనంతరం ప్రభాస్ శ్రీరాముని పాత్రలో నటించిన ఆది పురుష్ చిత్రం సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్ సూచించినట్టు తెలుస్తోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

Visitors Are Also Reading