Home » మోహన్ బాబు మొదటి భార్య ఎవరి వల్ల చనిపోయిందో తెలుసా…?

మోహన్ బాబు మొదటి భార్య ఎవరి వల్ల చనిపోయిందో తెలుసా…?

by Bunty

మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు విలన్ గా, హీరోగా అనేక సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తండ్రి పాత్రలకే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు మోహన్ బాబు దాదాపు 600 చిత్రాల్లో నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, రాజకీయవేత్తగా రాణించాడు. అనేక సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంటాడు. మోహన్ బాబుకి మొదటి భార్య చనిపోయింది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే తన మొదటి భార్య ఎందుకు చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం…మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మోహన్ బాబుకి విద్యాదేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది.

వీరికి కొన్ని రోజులకి మంచు లక్ష్మి, మనోజ్ జన్మించారు. వివాహ అనంతరం మోహన్ బాబుకి వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. రోజు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పూర్తయి ఇంటికొచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యేది. దీన్ని అతని భార్య విద్యాదేవి సహించలేకపోయింది. ఎప్పుడూ షూటింగ్ అంటూ రాత్రి సమయానికి వస్తే నాతో పిల్లలతో సమయం గడపడానికి మీకు టైం ఉండదా అని నిలదీసిందట. దీంతో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, అపార్ధాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు చాలా రోజులు అలాగే జరుగుతూ ఉండేవి.

ఇక మోహన్ బాబు ఎంత గొడవ పెట్టుకున్నా అలాగే చేసేసరికి విద్యాదేవి ఒకరోజు ఆ**త్య చేసుకుంది. తాను చనిపోయిన సమయానికి వారి పిల్లలు వయస్సు చాలా తక్కువ. వారికి తల్లి లేని లోటు తీర్చాలని మోహన్ బాబుకు నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలాదేవిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి మనోజ్ జన్మించాడు. నిర్మలా దేవి తన అక్క పిల్లలని చాలా బాగా చూసుకునేది. మనోజ్తో సమానంగా లక్ష్మీని, విష్ణుని చూసుకునేది. మొదట చాలా కోపంగా ఉండే మోహన్ బాబు నిర్మలాదేవిని వివాహం చేసుకున్న అనంతరం ఆ కోపం మెల్లిమెల్లిగా తగ్గింది. ఇప్పటికీ ఏ విషయమైనా ఖరాఖండీగా చెప్పేసే తత్వం మాత్రం మానలేదు.

 

ఇవి కూడా చదవండి

SS Rajamouli : జక్కన్నకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీసీ చైర్మన్‌గా నియామకం

పవన్‌ కళ్యాణ్‌ పేరుకు చరణ్‌ కూతురు పేరుకు మధ్య సంబంధం ఇదే

తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Visitors Are Also Reading