భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ తరువాత అంతగా క్రేజ్ సంపాదించుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. కేవలం భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023లో భాగంగా వాజ్ పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జేయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
Also Read : జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ అవార్డు.. ఆ సినిమాకేనా ?
లక్నో బ్యాటింగ్ జరుగుతుండగా.. విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. భద్రత సిబ్బందిని దాటుకొని మరీ నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లాడు. కింగ్ పాదాలకు దండం పెట్టాడు. అభిమాని సడెన్ గా అలా చేయడంతో విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతన్ని పైకి లేపి అప్యాయంగా హత్తుకున్నాడు. ఆ తరువాత గ్రౌండ్ నుంచి బయటికీ వెళ్లమన్నాడు. అయితే కోహ్లీని కలిసిన ఆ అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మైదానంలోనే గెంతులు, కేకలు వేస్తూ.. బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
King of World Cricket.
Kohli is loved by millions & won the hearts of everyone. pic.twitter.com/gPMmzp9tDH
— Johns. (@CricCrazyJohns) May 1, 2023
అకస్మాత్తుగా గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికొస్తే.. లక్నో పై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక 108 పరుగులకు చతికిలపడింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో 18 పరుగులతో పరాజయం పాలైంది.
Also Read : కోహ్లీ-గంభీర్ గొడవపై తిక్క కుదిర్చిన BCCI