చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ వాణి జయరామ్ ఇకలేరు. ఈరోజు ఆమె తుది శ్వాస విడిచారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న దురై స్వామి, పద్మావతి దంపతులకు వాణి జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. హిందుస్తానీ క్లాసికల్ సింగింగ్ లో ప్రావీణ్యం పొందిన వాణి జయరామ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, గుజరాతి, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా 14 భాషల్లో దాదాపు పదివేలకు పైగా పాటలు ఆలపించారు.
READ ALSO : తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !
Advertisement
అయితే ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈమెది సహజ మరణం కాదని, ఈమెపై కుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాయని వాణీ జయరామ్ శరీరంపై గాయాలు ఉండడంతో ఈమె మరణంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాణి జయరామ్ పనిమనిషి కూడా తన మరణంపై సంచలన వాక్యాలు చేశారు. వాణి జయరామ్ మరణించే ముందు తన గదిలో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని తన పనిమనిషి తెలియజేశారు.
Advertisement
అయితే తాను కిటికీ తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆమె కింద పడిపోయి ఉన్నారని ఈ విషయాన్ని తన బంధువులకు తెలియజేసి వారు వచ్చిన తర్వాత ఆమె తలుపులు బద్దలు కొట్టి తనను బయటకు తీసుకు వచ్చినట్లు పనిమనిషి తెలియజేశారు. దీంతో పోలీసులు ఈమె మరణంపై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వాణి జయరామ్ ముఖంపై మాత్రమే కాకుండా శరీరంపై కూడా పలుచోట గాయాలు ఉండడంతో తనపై హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Jabardasth : జబర్దస్త్ కి దిష్టి తగిలిందా..? అదిరే అభి సంచలన పోస్ట్