నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కు టాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రెటిలు విచ్చేశారు. బాలయ్యతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కాగా తాజాగా ఈ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దాంతో పవన్ బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ… పవన్ కళ్యాణ్ ను ఆసక్తికర విషయాల పై ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాగానే బాలయ్య షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నామో గుర్తుందా అంటూ బాలయ్య సుస్వాగతం సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోను చూపించారు.
Advertisement
Advertisement
ఆ ఫోటోలో నేను చాలా యంగ్ కనిపిస్తున్నాను కదా…. అంటూ బాలయ్య చెప్పగా పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అంటూ చమత్కరించారు. అంతేకాకుండా ఇంట్లో మీ భార్యకు భయపడతావా తల్లికి భయపడతావా అంటూ పవన్ కళ్యాణ్ ను బాలయ్య ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు పవన్ ఒక్కసారిగా నవ్వేశారు.
అంతేకాకుండా ఈ మూడు పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా..? అంటూ బాలయ్య పవన్ కళ్యాణ్ కు సూటి ప్రశ్న వేశారు. దాంతో పవన్ కళ్యాణ్ వాళ్ళు బాధపడతారేమో అని నేను మాట్లాడటం లేదు అంటూ చెప్పుకొచ్చారు. మధ్యలో సాయి ధరమ్ తేజ్ పంచె కట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఇక షో లో పవన్ కళ్యాణ్ బాలయ్య మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూడాల్సిందే.
Also read : కోపంతో ఫోన్ ని విసిరేసిన రణ్ బీర్.. ఎందుకో తెలుసా ?