టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త ఆమెది వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈమె భర్త నాగచైతన్యతో విడాకులు ప్రకటించినప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
పుష్ప చిత్రంలో స్పెషల్సాంగ్తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదే సమయంలో సమంత అమెరికాకు పయనం అవుతున్నట్టు తెలుస్తోంది. సమంత స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు సమంత అధికారికంగా స్పందించలేదు.
Advertisement
Advertisement
Also Read : ఎన్టీఆర్ పై ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజన్లు ట్రోల్స్..!
తాజాగా ఇదే విషయమై సమంత చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సమంత. సోషల్ మీడియాకి సైతం దూరంగా ఉంటూ వస్తోంది. అసలు ఈ వార్తలో ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మాత్రం సమంత స్పందిస్తే కానీ ఓ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా.. సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోదతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషీ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్తో పాటు హాలీవుడ్లో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.
Also Read : రియల్ ట్రెండ్ సెట్టర్ బాలయ్య ! 14 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు ఎన్ని ప్రయోగాలు చేసారో తెలుసా?