తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతుంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు తెలుస్తోంది.
ఎడమ కాలుకు ఈ గాయం అయినట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సామాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయనను చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Advertisement
ఇది ఇలా ఉండగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీకి కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిలిచింది. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!