Home » BREAKING : వైఎస్ అవినాష్ రెడ్డి, తల్లికి గుండెపోటు….

BREAKING : వైఎస్ అవినాష్ రెడ్డి, తల్లికి గుండెపోటు….

by Bunty
Ad

వివేకానంద రెడ్డి కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక పరిణామాలు జరిగాయి. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ఎదురుకుంటున్నారు. ఈ తరుణంలోని వివేకానంద రెడ్డి హ*కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Advertisement

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక పులివెందుల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తల్లి లక్ష్మమ్మ అస్వస్థత విషయం తెలిసిన అవినాష్ రెడ్డి హుటా హుటిన హైదరాబాద్ నుంచి వెనక్కుమళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం సిబిఐ ముందు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Advertisement

అయితే ఇప్పటికే తండ్రి భాస్కర్ రెడ్డి జైలులో ఉండటంతో తల్లిని చూసుకునేందుకు అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్లారు. సిబిఐ కార్యాలయానికి వెళ్లిన అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఉదయం చోటు చేసుకున్న పరిణామాలను లిఖిత పూర్వకంగా అధికారులకు అందించారు. తల్లికి అస్వస్థత విషయం తెలిసి అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారని, చివరి నిమిషంలో విషయం తెలియడంతో సిబిఐ విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు తెలిపారు.

అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైయస్ అవినాష్ రెడ్డికి కూడా గుండెపోటు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఛాతీలో నొప్పిగా ఉందని హాస్పిటల్లో చేరారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణ డుమ్మా కొట్టి తన తల్లి అనారోగ్యం బాగాలేదని పులివెందుల వెళ్ళాడు. అయితే సీబీఐ అధికారులు కూడా ఆయన వెంటపడటంతో తనకు కూడా ఛాతీలో నొప్పిగా ఉందని విశ్వభారతి ఆసుపత్రిలో చేరారు అవినాష్ రెడ్డి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Visitors Are Also Reading