Home » జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ శుభవార్త చెప్పనున్నారా ?

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ శుభవార్త చెప్పనున్నారా ?

by Anji
Ad

భారత బాక్సాఫీస్ ని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు.   భారత్ లో అతిచిన్న కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ దేశంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. కేజీఎఫ్ రెండు భాగాలు రికార్డు స్థాయి వసూలు రాబట్టాయి. ఈ మూవీ విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ అనే మూవీ చేస్తున్నారు. 

Advertisement

 

ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన చేశారు. గత ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజున పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు అభిమానులు సోషల్ మీడియాలో తెగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో జూన్ 4న  ప్రశాంత్ నీల్… జన్మదినోత్సవం నేపథ్యంలో ఎన్టీఆర్ తో చేయబోయే ఈ  సినిమాకి సంబంధించి పోస్టర్ నీ ఆ చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్స్ వారు ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్  చేశారు. 

Advertisement

దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ త్వరలో రాబోతుందని స్పష్టం చేసినట్టు అయింది. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ వర్క్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు అనుకుంటున్నారు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

పెళ్లి కాకముందే నిహారిక కోసం లావణ్య త్రిపాఠి అంతటి త్యాగం చేసిందా..?

Visitors Are Also Reading