Home » “జోష్” క‌థ చ‌ర‌ణ్ కు న‌చ్చినా చిరంజీవి ఎందుకు వ‌ద్ద‌న్నారు..?

“జోష్” క‌థ చ‌ర‌ణ్ కు న‌చ్చినా చిరంజీవి ఎందుకు వ‌ద్ద‌న్నారు..?

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేయడం కామన్. అయితే ఆ సినిమాని మిస్ చేసుకోవడం వ‌ల్ల కొన్నిసార్లు మంచి జరిగితే మరి కొన్నిసార్లు మాత్రం చెడు జరుగుతుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అలా ఒక హీరో చేయాల్సి ఉండగా మరో హీరో చేయడం జరిగింది. ఇక నాగచైతన్య హీరోగా పరిచయమైన జోష్ సినిమాకు కూడా మొదటి ఆప్షన్ మరో హీరోను అనుకున్నారు.

Also Read: పుష్ప పార్ట్ 1 లో ‘తగ్గేదిలే’ లాగా.. పార్ట్ 2 లో ఏది పెట్టబోతున్నారో తెలుసా ?

Advertisement

 

జోష్ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కార్తిక హీరోయిన్ గా నటించగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో జెడి చక్రవర్తి విలన్ గా నటించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు వాసు వర్మ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement

Also Read: రిలేషన్ షిప్ ఎంత ముఖ్యమో నాకు అర్థం అయ్యింది…నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్…!

అయితే సినిమా కథ స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విష‌యాల‌ను దిల్ రాజు బయటపెట్టారు. ఈ సినిమా కథను మొదట రామ్ చరణ్ కు చెప్పామని అన్నారు. చరణ్ కు కూడా క‌థ భాగా నచ్చిందని అన్నారు. కానీ చిరంజీవికి మాత్రం ఈ కథపై మిక్స్డ్ ఒపీనియన్ ఉందని అన్నారు.

ఇక అదే సమయంలో మగధీర సినిమాను మొదలు పెడదామని అనుకున్నట్టు తెలిపారు. దాంతో ఆ సమయంలో జోష్ చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి భావించారని దాంతో ఈ సినిమా కథను నాగార్జున చైతన్యలకు వివరించామని చెప్పారు. అలా చైతూ హీరోగా జోష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ అప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న గొడవల వల్ల సినిమా ఆడలేదని దిల్ రాజు పేర్కొన్నారు.

Also Read :  పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకాలలో 4 పెళ్లిళ్లు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు….!

Visitors Are Also Reading