అల్లు వారి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ బన్నీ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో బన్నీ సూపర్ డుపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
Advertisement
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే నిజానికి బన్నీ లో సూపర్ హిట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట. ఆ సినిమా మరేదో కాదు.
Advertisement
నితిన్ సద హీరో హీరోయిన్ లు గా నటించిన జయం సినిమా. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. అయితే తేజ ఈ సినిమాలో ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకున్నారు.
కానీ అప్పటికే బన్నీ పై రాఘవేంద్రరావు కర్చీఫ్ వేశారట. దాంతో తేజ చేసేది లేక నైజాం ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ జయం చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
Also read : “ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!