Home » సంతోషం లేకుండా చేస్తుర్రు.. విమర్శలపై పల్లవి ప్రశాంత్ ఏమన్నారంటే ?

సంతోషం లేకుండా చేస్తుర్రు.. విమర్శలపై పల్లవి ప్రశాంత్ ఏమన్నారంటే ?

by Anji
Ad

బిగ్‏బాస్ సీజన్ 7 లోకి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్‏గా అడుగుపెట్టి విజేతగా నిలిచి విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు దేశ వ్యాప్తంగా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా హాట్ టాపిక్ అయ్యాడు. కానీ విన్నర్ అయ్యాడనే సంతోషం పట్టుమని పది నిమిషాలు కూడా   లేకుండా చేశారు అతడి ఫ్యాన్స్. ప్రశాంత్‏కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే బిగ్‏బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అతడి తల్లి, భార్య కారులో ఉండగానే.. కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగులగొట్టారు.

Advertisement

ఆర్టీసీ అద్దాలను పగులగొట్టడంతో కేసు నమోదు అయింది. అలాగే  గీతు రాయల్, శోభా శెట్టి, అశ్విని కార్లను సైతం ధ్వంసం చేశారు. అసభ్యకరంగా మాట్లాడతూ నానా రచ్చ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ ఘటనను చాలా సీరియస్‏గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న నెగిటివిటీపై స్పందించాడు పల్లవి ప్రశాంత్.  ట్రోఫీ గెలిచిన అనంతరం తన ఊర్లో అడుగుపెట్టాడు ప్రశాంత్. బిగ్‏బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన ప్రశాంత్‏కు అతడి ఊర్లో ఘన స్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు రాష్ట్రాలోని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రశాంత్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. అయితే తనపై వస్తున్న విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్న నేను మళ్లా వచ్చినా.. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘన స్వాగతం పలికింది అన్నా.. మీడియా మిత్రులు చూసిర్రు.. ఇంతమంది ప్రజలు నా కోసం వచ్చిర్రా.. నన్ను గెలిపించిర్రు అని ఎంతో సంతోషించినా.. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగానే బాధగా ఉంది. ఏడుద్దామంటే మీరు నెగిటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. నా కోసం 60-70 యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. వచ్చిన వారందరికి ఫోటోస్, వీడియోస్ ఇచ్చినా.. అన్నం కూడా తినలేదు.. నాతో అయితలేదు అని చెప్పినా వినలేదు. 5 నిమిషాలు ఇవ్వు.. 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంట పడ్డారు. నేను మనిషినే కదా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. మరోవైపు ఈనెల 19 నుంచి పల్లవి ప్రశాంత్ కనిపించడం లేదంటూ పోలీసులు వెతుకుతున్నారు. తల్లిదండ్రులను అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.. ఎక్కడికి వెళ్లాడో తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం. ఈ విషయం పై ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading