Home » ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ‘ఖతార్ పాప’ ఏం చేసిందంటే.? 

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ‘ఖతార్ పాప’ ఏం చేసిందంటే.? 

by Anji
Ad

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినటువంటి ఖతార్ పాప అలియాస్ షాలిని గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఈమె పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని తన లవర్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. అసలు ఖతార్ పాప ఎవరినీ లవ్ చేసింది. ఎందుకు మోసం చేశారనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

షాలిని అలియాస్ ఖతార్ పాప టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది. ఈమె టిక్ టాక్ బ్యాన్ కావడంతో యూట్యూబ్ వీడియోలను ఇన్ స్టా రీల్స్ తో కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కొనసాగింది. ఆ తరువాత యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించినటువంటి పలు ఇంటర్వ్యూలలో బోల్డ్ కంటెంట్ తో తెగ వైరల్ అయింది. ఇప్పుడు తనను ప్రేమ పేరుతో రోహిత్  పఠాన్ ఖాన్ అనే వ్యక్తి మోసం చేశాడని.. హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన షాలినికి రోహిత్ పఠాన్ ఖాన్ తో పరిచయమేర్పడింది. 

Also Read :  సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి ఎనిమిదో హీరో

Advertisement

Manam News

ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కొద్ది రోజుల తరువాత ప్రేమిస్తున్నానంటూ.. రోహిత్ షాలినితో చెట్టపట్టాలేసుకొని తిరిగాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. షాలిని కూడా అతని మాయ మాటలు నమ్మింది. ఈ నేపథ్యంలోనే రోహిత్, షాలిని ఇద్దరు కలిసి గత 6 నెలలుగా బోరబండలో సహజీవనం చేస్తున్నారు. దీంతో షాలిని గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమంటూ రోహిత్ ని అడిగింది.

రోహిత్ సమాధానం చెప్పకుండానే దూరంగా ఉంటున్నాడు. ఇక విసుగు చెందిన షాలిని రోహిత్ ని గట్టిగా నిలదీయగా.. తాను పెళ్లి చేసుకోనని చెప్పేశాడు రోహిత్. అతని మాటలు విన్న షాలిని వెంటనే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 376, సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం షాలిని 5 నెలల గర్భవతి అని చెప్పడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  

Also Read :  తారకరత్న ప్రాణాలు పోవడానికి మొదటిరోజు జరిగిన ఆ తప్పే కారణమా..?

Visitors Are Also Reading