Home » వెంకటేష్, రాజేంద్రప్రసాద్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. కారణమేంటి?

వెంకటేష్, రాజేంద్రప్రసాద్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. కారణమేంటి?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ చెబుతున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Advertisement

ఇది ఇలా ఉండగా, స్టార్ నటుడు రాజేంద్రప్రసాద్, వెంకటేష్ మధ్య చాలా కాలం పాటు గ్యాప్ వచ్చిందనే విషయం ఇటీవల బయటపడింది. ఆ విషయం గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. రవి రాజా పినిశెట్టి డైరెక్షన్ లో వెంకటేష్, మీనా కాంబినేషన్లో వచ్చిన మూవీ చంటి. ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. అయితే ఈ చిత్రంలో మొదట హీరో రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట. ఆ టైంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట. ఈ మూవీ రీమేక్ రైట్స్ కేఎస్ రామారావు కొనుగోలు చేశారు.

Advertisement

అయితే ఈ మూవీ వెంకటేష్ కు కూడా బాగా నచ్చడంతో కేఎస్ రామారావు… రవిరాజ పినిశెట్టికు వెంకటేష్ హీరోగా పెట్టి చేయాలని చెప్పేశారు. కానీ రవి రాజా పెనిశెట్టి మాత్రం…. హీరో రాజేంద్ర ప్రసాద్ కి ఎప్పుడో మాట ఇచ్చాను… చేస్తే అతనితోనే చేస్తానని పట్టు బట్టారు. ఈ తరుణంలోనే హీరో చిరంజీవి రంగంలోకి దిగి…  వెంకటేష్, మీనాలతో ఈ సినిమా తీయించారు. దాంతో రాజేంద్రప్రసాద్ కి, వెంకటేష్ కి మధ్య గ్యాప్ వచ్చిందట. కొన్నాళ్లపాటు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని, ఆ మధ్య రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

READ ALSO : నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత!

Visitors Are Also Reading