Home » ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు…తట్టుకోలేక పేరెంట్స్ ఏం చేశారంటే…?

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు…తట్టుకోలేక పేరెంట్స్ ఏం చేశారంటే…?

by AJAY

తల్లిదండ్రులే తమ కూతురి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. తాము వద్దని చెప్పినా వినకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో తల్లిదండ్రులు కూతురు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెళ్లి చేసుకోవడమే కాకుండా తమకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇంట్లో ఉన్న కూతురి దుస్తులతో దిష్టిబొమ్మ తయారుచేసి దాన్ని దగ్ధం చేశారు. తమ కూతురు లేదని చనిపోయిందని భావిస్తూ ఇలా ప్రతీకారం తీర్చుకున్నామని అంటున్నారు ఆ పేరెంట్స్.

వివరాల్లోకి వెళితే….. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన సమ్మెట శరత్ చంద్ర, నాంపల్లి ప్రీతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరు కావడంతో కులాంతర వివాహం చేసేందుకు అంగీకరించలేదు. దాంతో పెద్దలను ఎదిరించి ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుండి రక్షణ కోరుతూ వర్ధన్నపేట పోలీసులను ఆశ్రయించారు.

దాంతో పోలీసులు ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. కానీ తమ కూతురు వద్దని చెప్పినా వినకుండా ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడాన్ని పేరెంట్స్ భరించలేకపోయారు. పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత ఆగ్రహంతో కూతురు దుస్తులతో దిష్టిబొమ్మ తయారు చేసి…. అనంతరం తమకు బిడ్డపుట్టలేదని.. చనిపోయిందని భావిస్తూ దిష్టిబొమ్మను దధ్దం చేశారు. బిడ్డ పై కోపంతో పేరెంట్స్ అలా చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. కూతురు దిష్టిబొమ్మను దగ్ధం చేసే సమయంలో అబ్బాయి బంధువులు వచ్చి ఆపే ప్రయత్నం చేయగా…. అమ్మాయి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడనుండి వెళ్ళిపోయారు.

Visitors Are Also Reading