Home » టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం.. కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం.. కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

by Bunty
Ad

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న కే.విశ్వనాథ్ కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఆయన సతీమణి నెల రోజులు కూడా కాకుండానే మరణించారు. కే.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి ఆదివారం నాడు గుండెపోటుతో మృతిచెందారు. ఆమె ఈరోజు అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జయలక్ష్మి.

Advertisement

ఇదిలా ఉంటే విశ్వనాథ్ ఫిబ్రవరి 2న పరమపదించారు. సినిమాను కలగా నమ్మిన దర్శకుడిగా విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరుగున పడుతున్న మన సాంస్కృతికి, కళలకి తన సినిమాలతో ప్రాచుర్యం కల్పించి బ్రతికించారు. కే.విశ్వనాథ్ సాహిత్యానికి, కళలకు చేసిన సేవ మరువలేనిది.

Advertisement

ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కానీ, సినిమాలపై అభిమానంతో చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆయన వాహిని స్టూడియోస్ లో సౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారు. 1965 లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు.

read also : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు…!

Visitors Are Also Reading