Home » ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు…!

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు…!

by Bunty
Ad

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపిఎస్సి, ఏపీ సాంకేతిక విద్యామండలి నిర్వహించే సిపిటి పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసులో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు.

Advertisement

Advertisement

దీంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు నియమితులయ్య అభ్యర్థులంతా సిపిటి తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ, ప్రకటన జారీ చేసింది. సిపిటి పరీక్ష వంద మార్కులకు నిర్వహించనున్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పోలా భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30

మార్కులు సాధిస్తే సరిపోతుందని తెలిపింది. బీసీలు 35, ఓసిలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. అయితే గ్రూప్-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

READ ALSO : గుజరాత్ టైటాన్స్ కు షాక్!రూ.4 కోట్ల ఆటగాడు దూరం!

Visitors Are Also Reading