Home » కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI

కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI

by Bunty
Ad

నిన్న జరిగిన మ్యాచ్ లో ధోని సేన మరో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సిబి పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు. తద్వారా ఐపిఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 259 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు.

READ ALSO :  Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Advertisement

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కి ఊహించని షాక్ తగిలింది. ఈ రన్ మెషిన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరులోని ఏం.చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫైన్ విధిస్తున్నాం.

READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !

మ్యాచ్ ఫీజులో 10% కోత పెడుతున్నాం. మిస్టర్ కోహ్లీ ఐపిఎల్ కోడ్ లోని ఆర్టికల్ 2.2 లోని లెవెల్ 1 నిబంధన ఉల్లంఘించారు అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కాగా, కోహ్లీకి ఏ ఘటన కారణంగా జరిమానా విధించారన్న విషయం వెల్లడించినప్పటికీ సీఎస్కే బ్యాటర్ శివమ్ దుబే అవుట్ అయిన సమయంలో కోహ్లీ వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.

READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

Visitors Are Also Reading