Home » 1020 రోజులకు ఫ్యాన్స్ కల నెరవేర్చిన విరాట్..!

1020 రోజులకు ఫ్యాన్స్ కల నెరవేర్చిన విరాట్..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ సెంచరీ గురించి కేవలం భారత అభిమానులే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూసారు. ఎప్పుడో 2019 లో బంగ్లాదేశ్ పైన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ అనేది చేసిన విరాట్ అప్పటి నుండి మళ్ళీ సెంచరీ అనేది చేయలేదు. అయితే గత ఏడాది నుండి పూర్తిగా లయను కోల్పోయిన విరాట్ కోహ్లీ.. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతూ.. విమర్శలు అనేవి ఎదుర్కున్నాడు.

Advertisement

కానీ తాజాగా విరాట్ కోహ్లీ టీం ఇండియా తరపున ఆసియా కప్ లో పాల్గొన్నాడు. అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ నుండే విరాట్ కొని తాను ఫామ్ లోకి వచ్చాను అని చూపించాడు. కానీ చివరగా శ్రీలంకతో మ్యాచ్ లో కోహ్లీ డక్ ఔట్ కావడంతో కోహ్లీపైన ఆశలు అనేవి పోయాయి. కానీ తాజాగా ఆరోజు ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిమానుల కలను కోహ్లీ నెరవేర్చాడు.

Advertisement

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1020 రోజుల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ అనేది చేసాడు. ఇది కెరియర్ లో కోహ్లీకి 71 వ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ సెంచరీ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో ఇదే మొదటిసారి. గతంలో కోహ్లీ చేసిన అన్ని సెంచరీలు వన్డే, టెస్టులోనే అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు టీ20 ల్లో కూడా సెంచరీ చేయడంలో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ కు అందుబాటులోకి జడేజా..?

ఇప్పటికైనా సంజూకి అవకాశాలు ఇస్తారా…?

Visitors Are Also Reading