Home » ఫోన్ లాక్… వికారాబాద్ శిరీష మృతి కేసులో సంచలన విషయాలు.. కారణం బావనే?

ఫోన్ లాక్… వికారాబాద్ శిరీష మృతి కేసులో సంచలన విషయాలు.. కారణం బావనే?

by Bunty
Ad

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష అనుమానాస్పద మృతి కేసు రెండు రోజుల కిందట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో వరుసగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శిరీష అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక తాజాగా, శిరీష అనుమానాస్పద మృతి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.

Advertisement

 

శిరీష ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను వివరాలడిగిన ఎస్పీ….శిరీష మృతి కి ముందు ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. మృతికి ముందు సెల్ ఫోన్ విషయంలో బావ అనిల్ తో గొడవ పడి ఇంట్లో నే ఆత్మ**త్య చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసిందన్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. ఆ తర్వాత బయటకు వెళ్ళి ఆత్మ**త్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

యువతి దేహంపై ఉన్న గాయాల ఆధారంగా బయటి వ్యక్తులు హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ కోటిరెడ్డి.యువతి దేహంపై ఉన్న గాయాల ఆధారంగా పోస్ట్ మార్టం కూడా పూర్తయ్యిందన్నారు. ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల యువతి మనస్థాపం చెంది ఉంటుందని భావిస్తున్నామని…ఫోన్ లాక్ ఉన్నందున దాన్ని సైబర్ క్రైం కు పంపించి ఫోన్ పూర్తి డాటా తీయిస్తామని చెప్పారు ఎస్పీ.

Visitors Are Also Reading