Home » వరుణ్ తేజ్-లావణ్య రిసెప్షన్ రెండోసారి.. ఎందుకో తెలుసా ?

వరుణ్ తేజ్-లావణ్య రిసెప్షన్ రెండోసారి.. ఎందుకో తెలుసా ?

by Anji

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పెళ్లి ద్వారా ఒకటైన జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి   అనే విషయం అందరికీ తెలుసు. నవంబర్ ఒకటవ తేదీన వీరిద్దరి వివాహం ఇటలీలో దగ్గరి బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి చిరంజీవి ఫ్యామిలీతో పాటుగా నితిన్, అల్లు అర్జున్ మాత్రమే వెళ్లారు. అక్టోబర్ 30వ తేదీన మొదలైన ఈ పెళ్లి వేడుక మూడు రోజులపాటు అట్టహాసంగా కొనసాగింది. మరి పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

Varun-lavanya

 

 ఇక పెళ్లి తంతు ముగిసిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన ఈ జంట పలువురు టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ నాయకులందరిని పిలిచి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్ గా రిసెప్షన్ జరిపారు. ఈ విధంగా వీరి పెళ్లి తంతు పూర్తయిపోయింది. అయితే లావణ్య త్రిపాఠి తన మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి వచ్చిన పండుగ దీపావళి. ఈ పండగ రోజున ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ కొత్త జంట రెండోసారి రిసెప్షన్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

varun-tej-lavanya-tripathi-honey-moon-place-bali-city-in-indonesia-

 దానికోసమే డెహ్రాడూన్ వెళ్తున్నారట. తాజాగా వీరు హైదరాబాద్ లోని విమానాశ్రయంలో కనిపించారు. మీరు రెండవసారి ఎందుకు రిసెప్షన్ చేసుకుంటున్నారు అంటే.. లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్  లో పుట్టింది. అక్కడే బాల్యమంతా గడిచింది. అయితే వీరి బంధువులు పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. అయితే లావణ్య బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించేందుకు డెహ్రాడూన్ వెళ్తున్నారట. ప్రస్తుతం ఏయిర్ ఫోర్ట్ కి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading