Home » పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్…!

పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్…!

by Azhar
Ad

ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అనేది ఈ నెల 28న జరగనుఏం విషయం తెలిసిందే. నాలుగేళ్ళ తర్వాత ఈ ఏడాది ఆసియా కప్ అనేది జరగబోతుంది. ఈ నెల 27న యూఏఈ వేదికగా ఈ టోర్నీ ఆరంభం కాబోతుంటే.. ఆ మరుసటి రోజే దాయాదుల మ్యాచ్ పోరు అనేది జరుగుతుంది. అయితే ఈ టోర్నీకి సంబంధించిన జట్లను రెండు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. కానీ మన ఇండియా జట్టులో కీలక పేసర్ బుమ్రా లేడు.

Advertisement

వెన్నుగాయం కారణంగా అతను ఈ టోర్నీలో ఆడకపోతుండటంతో.. తమ విజయ అవకాశాలు అనేవీకి పెరిగిపోయాయి అని పాకిస్థాన్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. కానీ ఆ సంబరాల్లో ఉండగానే ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు పెద్ద షాక్ అనేది తగిలింది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో ఇండియాను పాకిస్థాన్ జట్టు మొదటిసారి ఓడించింది. అయితే అప్పుడు పాక్ విజయంలో ఆ జట్టు పేసర్ షాహిన్ ఆఫ్రిది కీలక పాత్రా అనేది పోషించాడు.

Advertisement

కానీ ఇప్పుడు ఆ షాహిన్ ఆఫ్రిది ఇండియాతో 28న జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండటం కష్టం అని తెలుస్తుంది. అయితే ఆఫ్రిది ఇప్పుడు మోకాలి గాయంతో భాధపడుతున్నాడు. తీరిక లేని క్రికెట్ ఆడుతునందున ఆ గాయం అనేది తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు నెదర్లాండ్స్ టూర్ కు అతడిని ఎంపిక చేసినా.. పూర్తి విశ్రాంతి ఇవ్వనున్నారు. అయిన కూడా అతను కోలుకోవడానికి సమయం పడుతుందని తెలుస్తుంది. కాబట్టి అతను ఇండియా మ్యాచ్ ఆడలేడు అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ భారత జట్టు పగ్గాలు అందుకోనున్న దాదా..!

ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

Visitors Are Also Reading