Home » అతడు సినిమా నుండి ఉదయ్ కిరణ్ తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ..!

అతడు సినిమా నుండి ఉదయ్ కిరణ్ తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ..!

by AJAY
Published: Last Updated on
Ad

కొన్ని సినిమాలు ఒక హీరోతో అనుకుంటే మరొక హీరో చేయాల్సి వస్తుంది. అలా మిస్ చేసుకున్న సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ తాము మిస్ చేసుకున్న సినిమాలు సూపర్ హిట్ అయితే మాత్రం భారీ నష్టాన్ని మిగులుస్తుంది. ప్రతి హీరోకు అలాంటి అనుభవాలు ఉంటాయి.

udaykiran-trivikram-movie

Advertisement

ఇక టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కు సైతం అలాంటి అనుభవం ఉంది. మొదటగా త్రివిక్రమ్ రచయితగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Also Read: చిరంజీవి వల్లే ఉదయకిరణ్ లైఫ్ చెడిపోయిందా ? ఉదయ్ కిరణ్ అక్క చెప్పిన నిజాలు .!

udaykiran

udaykiran

నువ్వేకావాలి సినిమాతో మాటల రచయిత గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. త్రివిక్రమ్ టాలెంట్ ను చూసిన నిర్మాతలు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అలా తరుణ్ శ్రియ హీరోయిన్ గా త్రివిక్రమ్ మొదటి సినిమా నువ్వే నువ్వే తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఉదయ్ కిరణ్ డేట్స్ చాలా బిజీగా ఉండేవి.

Advertisement

దాంతో ఈ సినిమా తరుణ్ వద్దకు వెళ్లింది. అంతేకాకుండా త్రివిక్రమ్ అతడు సినిమా కథను కూడా మొదట ఉదయ్ కిరణ్ కి వినిపించారు. అంతేకాకుండా జయభేరి బ్యానర్ లో సినిమాను చేయాల్సి ఉండగా ఉదయ్ కిరణ్ త్రివిక్రమ్ ఇద్దరు కూడా అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ షూటింగ్ సమయానికి డేట్స్ అడ్జస్ట్ అవకపోవడం తో ఈ సినిమాను ఉదయ్ కిరణ్ వదులుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాను స్టార్ హీరోలతోనే చేయాలని నిర్ణయించుకున్నారు.

మొదట ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా ఆయన కథ విని నిద్రపోయారు. దాంతో అక్కడి నుండి త్రివిక్రమ్ సైలెంట్ గా వెళ్ళిపోయారట. ఇక నాని సినిమా షూటింగ్ లో ఉన్న మహేష్ బాబు కి త్రివిక్రమ్ అతడు సినిమా కథను వినిపించారు. మహేష్ బాబుకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. అలా 2001లో త్రివిక్రమ్ ఉదయ్ కిరణ్ తో సినిమా అనుకుంటే మహేష్ బాబు హీరోగా 2005లో అతడు సినిమా విడుదలైంది.

Also Read: మధ్యలోనే ఆగిపోయిన ఉదయకిరణ్ సినిమాలు ఇవే ..! ఇవే విడుదల అయ్యుంటే అయన ఇమేజ్ ఇంకోలా

Visitors Are Also Reading