Home » సీఎం జగన్ వల్లే “సర్కారు వారి పాట” అలా అయ్యిందంటూ మండి పడుతున్న ఫ్యాన్స్…!

సీఎం జగన్ వల్లే “సర్కారు వారి పాట” అలా అయ్యిందంటూ మండి పడుతున్న ఫ్యాన్స్…!

by AJAY
Published: Last Updated on
Ad

sarkaru vaari paata: సినిమా ఆడక పోవడానికి కారణమేదైనా కొన్ని సిల్లీ రీజన్ లను వెతికి నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో వరుసగా విడుదలైన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏపీ సీఎం జగన్ అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వస్తోంది. దాంతో సీఎం జగన్ పై ట్రోల్స్ మరింత పెరిగాయి. ఏపీలో టికెట్ ధరల ఇష్యూపై మొదట మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలిశారు.

sarkaru vaari paata

sarkaru vaari paata

టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతులు ఇవ్వాలంటూ కోరారు. దాంతో సీఎం జగన్ తదుపరి సమావేశానికి మెగా స్టార్ తో పాటు మరి కొందరు సినీ పెద్దలను సైతం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో టాలీవుడ్ నుండి స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు సైతం చిరంజీవి తో సీఎం జగన్ వద్దకు వెళ్లారు. ఈ ఘటన జరిగి చాలా కాలం అవుతోంది.

Advertisement

Advertisement

కాగా కొంతకాలానికి ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో సీఎం జగన్ ను కలవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ ప్రచారం జరిగింది. ఇక ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదల అయింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో కొంతమంది దీన్నే కర్మసిద్ధాంతం అంటారు అంటూ చిరంజీవిని… సీఎం జగన్ ను ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా విడుదలైన సర్కారు వారి పాట సినిమాకు కూడా మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. దాంతో నెటిజన్లు ఈ మూడు సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం సీఎం జగన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా మరోసారి సీఎం జగన్ పిలిచినా వెళ్ళకూడదు అని మీమ్ లను వైరల్ చేస్తున్నారు.

Also read :

“సర్కారు వారి పాట” సినిమాలో పవన్ ఫాన్స్ ని టార్గెట్ చేసి మరీ అవమానించారా ?

సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?

Visitors Are Also Reading