Home » “రాధేశ్యామ్” క‌థ‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా…!

“రాధేశ్యామ్” క‌థ‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా…!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. సినిమా విడుద‌ల దగ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ ప్రమోష‌నల్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా టీజ‌ర్ ట్రైల‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: అత‌డితో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర‌వాత తీవ్ర‌మైన డిప్రెష‌న్…రామ్ హీరోయిన్ ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

radhe shyam

radhe shyam

టీజ‌ర్ ట్రైల‌ర్ లు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ప్ప‌టికీ క‌థ‌ను అందించింది మాత్రం టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కావ‌డం విశేషం.

Advertisement

నిజానికి తానే ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మొద‌ట అనుకున్నార‌ట‌. అంతే కాకుండా విక్ట‌రీ వెంక‌టేష్ కు క‌థ‌ను కూడా వినిపించార‌ట‌. పామిస్ట్రీ ఆధారంగా ఉన్న ఈ క‌థ మొద‌టి పార్ట్ న‌చ్చిన‌ప్ప‌టికీ సెకండ్ పార్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో విక్ట‌రీ వెంక‌టేష్ ఈ క‌థ‌కు నో చెప్పార‌ట‌. దాంతో చంద్ర‌శేఖ‌ర్ ఈ క‌థ‌ను జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కు అమ్మేశారు. ఇక అదే క‌థలో చాలా మార్పులు చేసి రాధాకృష్ణ ప్ర‌భాస్ కు చెప్పి ఒప్పించారు.

radhe shyam

Radhe Shyam

అంతే కాకుండా అస‌లు ఈ క‌థ‌లో ప్రేమ‌క‌థ లేక‌పోవ‌డంతో ఆ త‌ర‌వాత ప్రేమ‌క‌థ‌ను యాడ్ చేయ‌డం విశేషం. బాహుబ‌లి సినిమా కంటే ముందే ప్ర‌భాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక బాహుబ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ తో క‌థ‌లో చాలా మార్పులు చేసి రాధేశ్యామ్ ను తెర‌కెక్కించారు. మ‌రి ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌స్తోన్న రాధే శ్యామ్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి.

Also Read: “వేదం” సినిమా క‌ర్పూరం ఎవ‌రో తెలుసా…అనుష్క‌కు ఏమ‌వుతుందంటే..!

Visitors Are Also Reading