Home » నేడు జ‌డేజాకు చారిత్రాత్మ‌క మ్యాచ్‌.. ఆ క్ల‌బ్‌లో చేరిన మూడ‌వ ఆట‌గాడు..!

నేడు జ‌డేజాకు చారిత్రాత్మ‌క మ్యాచ్‌.. ఆ క్ల‌బ్‌లో చేరిన మూడ‌వ ఆట‌గాడు..!

by Anji
Ad

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇవాళ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నున్న‌ది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల‌లో ఓడిన జ‌ట్టు గెల‌వాల‌నే త‌ప్ప‌తో ఉన్న‌ది. మ‌రొక వైపు కొత్త కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజాకు ఈ మ్యాచ్ చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఇది 150వ మ్యాచ్ కావ‌డం విశేషం.


ర‌వీంద్ర జ‌డేజా మైదానంలోకి దిగిన‌ప్పుడు అత‌ను 150వ సారి చెన్నై జెర్సీలో క‌నిపిస్తాడు. మ‌హేంద్ర‌సింగ్ ధోని, సురేష్ రైనా త‌రువాత 150వ మ్యాచ్ ఆడిన మూడ‌వ ఆట‌గాడు జ‌డేజా. సీఎస్‌కే త‌రుపున ధోని 217 మ్యాచ్‌లు ఆడ‌గా.. సురేశ్ రైనా 200 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Advertisement

సీఎస్‌కేతో జ‌డేజా క్రికెట్ జ‌ర్నీ 2012లో ప్రారంభం అయింది. ఆల్‌రౌండ‌ర్‌గా ద‌శాబ్ద కాలం పాటు జ‌ట్టుకు సేవ‌లు అందించారు. 2018, 2022 సంవ‌త్స‌రాల్లో జ‌ట్టు అత‌న్ని నిలుపుకుంది.


149 మ్యాచ్‌ల‌లో 110 వికెట్లు తీసి సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక వికెట్లు మూడ‌వ బౌల‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. అంతేకాదు 1,523 ప‌రుగులు కూడా చేశాడు. అత‌ను జ‌ట్టులో కీల‌కం.

Visitors Are Also Reading