Home » మూడు మార్పులతో పాక్ పైకి భారత్..?

మూడు మార్పులతో పాక్ పైకి భారత్..?

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య రేపు మరో మ్యాచ్ జరగనుంది. అయితే ఆసియా కప్ లో భాగంగా గ్రూప్ దశలో గత ఆదివారం ఏ రెండు జట్లు తలపడగా ఇండియా ఆఖరి ఓవర్ లో విజయం సాధించింది. అయితే రేపు సూపర్ 4 లో భాగంగా మరోసారి ఇండియా, పాక్ జట్లు ఎదురుపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో రానున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ ఆసియా కప్ లో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో రాణించని ఓపెనర్ రాహుల్ స్థానంలో.. గత పాక్ మ్యాచ్ లో ఆడని రిషబ్ పాత్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. రోహిత్, పంత్ ఓపెనింగ్ చేస్తే కుడి, ఎడమ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది అనేది అర్ధం అవుతుంది. అదే విధంగా పాక్ పై చివరి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన జడేజా ఇప్పుడు గాయంతో జట్టులో లేడు.

Advertisement

కాబట్టి అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడుతారు. ఇక అదే విధంగా బౌలింగ్ టీం లో యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ఎంత దారుణంగా బౌలింగ్ చేసాడు అనేది అందరికి తెలుసు. కాబట్టి అతని స్థానం లో మరో యంగ్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ ని జట్టులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూడు మార్పులతో వచ్చి భారత్ రేపు పాక్ పై గెలుస్తుందా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ..!

ఐపీఎల్ 2023 కోసం సన్‌రైజర్స్ చర్యలు..!

Visitors Are Also Reading