Home » జగపతి బాబు, సౌందర్య పై అప్పట్లో అలా న్యూస్ రావడానికి కారణం ఇదే..!

జగపతి బాబు, సౌందర్య పై అప్పట్లో అలా న్యూస్ రావడానికి కారణం ఇదే..!

by Anji
Ad

హీరోయిన్ సౌందర్య గురించి తెలియని వారుండరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఆమెను మహానటి సావిత్రితో ఆమెను పోల్చే వారు.తాను తెలుగింటి అమ్మాయి కాకపోయిన తెలుగువారి మనస్సులో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 100 సినిమాల్లో కథానాయకిగా నటించారు సౌందర్య. దాదాపు ఆమె అగ్ర హీరోలందరి సరసన నటించారు.  పెళ్లి చేసుకోవడంతో నటిగా సౌందర్య అధ్యయనం ముగిసిందని.. అందరూ అనుకున్నారు. కొన్ని పాత్రలకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని వెతుక్కుంటూ ఆమె దగ్గరికి కొన్ని పాత్రలు వెళ్లాయి.

Advertisement

పెళ్లి తరువాత కూడా తాను తీసిన 100వ చిత్ర శ్వేతనాగులో ఆమె నటించారు. సౌందర్య తొలుత రైతు భారతం, మనవరాళి పెళ్లి వంటి చిత్రాల్లో నటించింది. అమ్మోరు చిత్రంలో సురేష్ సరసన నటించిన తెలుగులో తొలి హిట్ సినిమా మాత్రం రాజేంద్రుడు గజేంద్రుడు అని మాత్రమే చెప్పాలి. అమ్మోరు చిత్రీకరణకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టడంతో అంతకు ముందే ఆమెకు వేరే చిత్రాలతో క్రేజ్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ తో మాయలోడు చిత్రంలో నటించారు. మెడమ్ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఇక అప్పటి నుంచి సౌందర్య జాతకం మారిపోయిందనే చెప్పాలి. కృష్ణ అగ్ర హీరోతో నటించడంతో ఆమె స్థాయి పెరిగిపోయింది. 

Also Read :   న‌దియా కూతుళ్లు ఎంత అందంగా ఉన్నారో చూశారా..? ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారంటే..?

Manam News

Advertisement

దీంతో అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశాలు ఆటోమెటిక్ గా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన తొలి చిత్రం రిక్షావోడు. ఆ తరువాత సిపాయి,  చూడాలని ఉంది, అన్నయ్య వంటి సినిమాల్లో నటించారు. అదేవిధంగా నందమూరి నటసింహం బాలయ్యతో నటించిన ఏకైక తొలిచిత్రం టాప్ హీరో. బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్న నర్తనశాలలో సౌందర్య షూటింగ్ లో కూడా పాల్గొన్నారు.  ఆ చిత్రం షూటింగ్ నాలుగు రోజులు పడుతున్న తన వర్క్ ని ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేశారట.  రెండో షెడ్యూల్ ప్రారంభం కాకముందే విమాన ప్రమాణంలో సౌందర్య కన్నుమూశారు. నాగార్జునతో ఎదురులేని మనిషి, రాముడొచ్చాడు, నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాల్లో నటించింది. విక్టరీ వెంకటేష్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది సౌందర్య. 

Also Read :  అన్ స్టాపబుల్ షోకి పవన్ వేసుకున్న బ్లాక్ హుడీ ధర ఎంతో తెలుసా ?

Manam News

వెంకటేష్ సరసన సౌందర్య తొలిసారిగా నటించిన చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత నటించిన చిత్రం పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా, జయం మనదేరా వంటి చిత్రాలన్ని హిట్ అయ్యాయి. అదేవిధంగా మోహన్ బాబు అంటే సౌందర్యకి ఎంతో గౌరవం. పెద్దరాయుడు సినిమాలో తనకు మంచి అవకాశం ఇచ్చినందుకు పదే పదే ఆమె  కృతజ్ఞతలు చెప్పేవారు. ఆయన సరసన రాయుడు, పోస్ట్ మ్యాన్, అధిపతి, శ్రీరాములయ్య వంటి చిత్రాల్లో నటించారు. సౌందర్య నటించిన చివరి చిత్రం శివశంకర్ మోహన్ బాబుదే కావడం గమనార్హం. సౌందర్యతో ఎంతో సన్నిహితంగా మెలిగారు హీరో జగపతి బాబు. వారి మధ్య సాన్నిహిత్యం చూసి వీరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకునేవారు. మంచి స్నేహితులం అని ఎన్నిసార్లు చెప్పిన వదంతులు మాత్రం ఆగలేదు. చివరికీ సౌందర్య పెళ్లి చేసుకొని వాటన్నింటికి సమాధానం చెప్పేసింది. 

Also Read :  ఆ డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారెజ్.. కోర్టులో నిజం చెప్పేసిన దర్శకుడు..!

Visitors Are Also Reading