Home » ఉదయ్ కిరణ్, శ్రియా చేయాల్సిన “ఆనందం” చిత్రం చేతులు ఎందుకు మారిందో మీకు తెలుసా ?

ఉదయ్ కిరణ్, శ్రియా చేయాల్సిన “ఆనందం” చిత్రం చేతులు ఎందుకు మారిందో మీకు తెలుసా ?

by Anji
Ad

శ్రీను వైట్ల దర్శకత్వంలో 2001లో తెరకెక్కించిన చిత్రం ఆనందం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఈ చిత్రం విజయంతో పాటు.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తమిళ, కన్నడ భాషల్లో పునర్ నిర్మించబడింది. అన్ని భాషల్లో రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేద వ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రానికి సంగీతం చాలా అద్భుతమనే చెప్పాలి. 

Advertisement

ఈ సినిమా కేవలం రూ.2కోట్లు వస్తే చాలు అనుకున్న సమయంలో ఏకంగా ఐదు రెట్లు అనగా.. రూ.10కోట్లు కలెక్లన్లు సాధించింది. ఏడాదికి ఉత్తమ బ్లాక్ బస్టర్ చిత్రంగా అవతరించింది. ఈ సినిమా అటు దర్శకుడు శీను వైట్లకి కూడా మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి స్టార్ దర్శకుడిగా అవతరించేవిధంగా చేసింది.  ఈ చిత్రంలో హీరోగా నటించిన ఆకాశ్ కి ఇది రెండో చిత్రం. తమిళంలో ఒక సినిమా తీసి తెలుగులో రెండో సినిమాగా ఆనందం చిత్రం విడుదల కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు ఆకాశ్. రేఖ కూడా అప్పటికీ కేవలం ఒక కన్నడ సినిమా మాత్రమే నటించింది. తరువాత తెలుగులో ఆనందం సినిమా ద్వారానే డెబ్యూ చేసి సూపర్ క్రేజీ హీరోయిన్ గా మారింది. కానీ వీరిద్దరూ తమ కెరీర్ ని తరువాత అనుకున్నంత స్థాయిలో మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయారు.  

Advertisement

Also Read :  శాకుంతలం మూవీలో సమంత కట్టుకున్న చీర, నగల ధర ఎంతంటే..?

అసలు విషయంలోకి వెళ్లితే.. హీరోగా ఆకాశ్, హీరోయిన్ గా రేఖని తీసుకోవడానికి ముందే హీరోగా ఉదయ్ కిరణ్ ని, హీరోయిన్ గా శ్రియాని తీసుకోవాలనుకున్నారట. అయితే  శ్రియతో నాలుగు సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకొని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నిర్మాత రామోజీ రావు. కానీ ‘ఆనందం’ చిత్రానికి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు శ్రీను వైట్ల రేఖను సీన్ లోకి తీసుకొచ్చాడు.  అదేవిధంగా సెకండ్ హీరోగా అనుకున్న ఆకాశ్ ని లావు తగ్గమని చెప్పి ఫస్ట్ హీరోగా చేసి.. అప్పటికే సీతారాముల కళ్యాణం చేసిన వెంకట్ ని సెకండ్ హీరోగా తీసుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో నటించిన తనురాయ్ ని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించారు. ఇక ఆ తరువాత ఉదయ్ కిరణ్, శ్రియాతో కలిసి శ్రీనువైట్ల సినిమా చేయలేదు. కానీ ఉదయ్ కిరణ్, శ్రియా మాత్రం నీకు నేను నాకు నువ్వు అనే సినిమాలో కలిసి నటించారు. అలా.. ఉదయ్ కిరణ్, శ్రియా కాంబినేషన్ లో రావాల్సిన ‘ఆనందం’ చిత్రం ఆకాశ్, రేఖ కాంబినేషన్ లో తెరకెక్కించారు.  

Also Read :   తారకరత్న ఫాదర్ మోహనకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?

Visitors Are Also Reading