Home » “చక్రం” సినిమా ప్లాప్.. దానికి కారణం ప్రభాసే అన్న కృష్ణవంశీ..!!

“చక్రం” సినిమా ప్లాప్.. దానికి కారణం ప్రభాసే అన్న కృష్ణవంశీ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు కృష్ణవంశీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన మరొక సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ రంగ మార్తాండ.. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తో చేసిన చక్రం మూవీ గురించి తెలియజేశారు. వర్షం సినిమా తర్వాత ప్రభాస్ కు మాస్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారని, ఈ సందర్భంలోనే ఆధ్యాత్మికమైన పాయింట్ చక్రం సినిమా తీద్దామని కృష్ణవంశీ అడిగితే ఆయన చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.

Advertisement

అయితే వర్షం మూవీ హిట్ అయిన తర్వాత, ప్రభాస్ ను కృష్ణవంశీ కలిసినప్పుడు ప్రభాస్ కు రెండు కథలు చెప్పారట. అందులో ఒకటి చక్రం సినిమా.. రెండోది రాయలసీమ కథాంశం, యాక్షన్, దుమ్ములేపే ఫైట్స్, గుప్తనిధుల గురించి సాగే కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉంటుందని చెప్పారట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రభాస్ తో చేద్దామని కృష్ణవంశీ అనుకున్నారట. కానీ ఇందులో యాక్షన్ మూవీని ప్రభాస్ ఒప్పుకోలేదు. వర్షం సినిమా తర్వాత యాక్షన్ సినిమాలతోనే వస్తున్నారు కానీ.. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీ చేస్తే బాగుంటుందన్నారు. దీంతో చక్రం సినిమాకి ఓకే చెప్పేశారు..

Advertisement

సినిమా షూటింగ్ పూర్తయింది థియేటర్లోకి వచ్చి ఆయన కెరియర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి ఇలాంటి సినిమా రావడం ఎవరూ ఊహించలేదు. ఈ విధంగా ఆ సమయంలో ప్రభాస్ యాక్షన్ సినిమా ఒప్పుకొని ఉంటే మాత్రం హైరేంజ్ లో ఇంకో విధంగా ఉండేదని అన్నారు.. ప్రస్తుతం ఎమోషనల్ డ్రామాగా రంగమార్తాండ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు కృష్ణవంశీ. ఇందులో బ్రహ్మానందం, అనసూయ, రమ్యకృష్ణ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

also read:

Visitors Are Also Reading