Home » చంద్రబాబు, పవన్ వదిలిన బాణాన్ని.. పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

చంద్రబాబు, పవన్ వదిలిన బాణాన్ని.. పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anji
Ad

రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం పై నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను అని స్పష్టం చేశారు. తాను టీడీపీ, జనసేన పార్టీల తరుపున ప్రచారం చేస్తానని తెలిపారు. నేను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బానాన్ని అన్నారు. డ్యాన్స్ లు, సినిమాలు, కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేవారు అసలు మంత్రులా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల గురించి అంబటికి ఏమైనా తెలుసా? ఎమ్మెల్యేల స్థానాలు మార్చితే.. వైసీపీకి ప్రజలు ఓట్లు వేయరు. బూతుల మంత్రులు, యూనివర్సిటీకి త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు పృథ్వీరాజ్. 

Advertisement

Advertisement

 

టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికం అన్నారు. ఒక చోట గెలిచిన వ్యక్తిని మరోచోట తీసుకువెళ్లి వేస్తే ఓటు ఎవరు వేస్తారు.? 175కు 175 సీట్లు మీరు గెలుస్తామన్నప్పుడు భయం ఎందుకు.. ఈ మార్పులు ఎందుకు..?నేను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశాను. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి..? 130 స్థానాలతో టీడీపీ, జనసేనల మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలి అని ప్రశ్నించారు.

రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో ఒక్క రాజధాని లేదు.. ఇంక మూడు ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు.  ఎన్నికలు మొదలవుతున్నాయి.. ప్రచారానికి వస్తాను.. ఒక్కొక్కరి దుమ్ము దులపుతాను. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ నన్ను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తానని తెలిపారు. ఎవరి జాతకం ఏంటనేది నా దగ్గర ఉంది. లోకేష్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు నా దగ్గర కూడా ఓ పీఆర్ డైరీ ఉంది. అందరి జాతకాలు బయటపెడతానని పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Visitors Are Also Reading