Home » రాజమౌళి- మహేష్ సినిమాలో ఆ సీన్ సినిమాకి హైలెట్ అట..!

రాజమౌళి- మహేష్ సినిమాలో ఆ సీన్ సినిమాకి హైలెట్ అట..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటేనే మామూలుగా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక మహేష్ ఇప్పుడు చేస్తున్న సినిమాలో స్టార్ డైరెక్టర్ తో దాంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్దే కథానాయకగా నటిస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన జక్కన్న తదుపరి సినిమా మహేష్ తో చేయనుండడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో జక్కన్న మాట్లాడుతూ.. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఉండనుందని చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. అంతే కాదండోయ్.. వీరి కాంబోలో రాబోతున్న సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రాబోతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

Advertisement

Also Read :  కొత్త లుక్ లో ఎన్టీఆర్‌.. కొర‌టాల సినిమా కోస‌మేనా ?

manam news

ఇక ఈ సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే కొందరు మనుషులతో ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. అడవి మనుషులతో మహేష్ బాబు చేయబోతున్న యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ టీమ్ ను రంగంలోకి దించే ఉద్దేశంతో జక్కన్న ఉన్నాడట. మరి ఈ వార్త వాస్తవమో కాద్దో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read :  మ‌హేశ్ బాబు వ‌దిన కూడా తెలుగులో హీరోయిన్ గా న‌టించిందన్న సంగ‌తి తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

Visitors Are Also Reading