Home » కాపీ ట్యూన్ల పై స్పందించిన త‌మ‌న్…ఆల్బ‌మ్ క్రెడిట్ డైరెక్ట‌ర్ ప‌ర‌షురామ్ కే ఇస్తున్నా అంటూ..!

కాపీ ట్యూన్ల పై స్పందించిన త‌మ‌న్…ఆల్బ‌మ్ క్రెడిట్ డైరెక్ట‌ర్ ప‌ర‌షురామ్ కే ఇస్తున్నా అంటూ..!

by AJAY
Ad

మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప‌ర‌షురామ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా మ‌హేశ్ బాబుకు జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు ఎస్ఎస్ త‌మ‌న్ స్వరాలు స‌మ‌కూర్చారు. ఇక ఈ సినిమా ఆల్బ‌మ్ సినిమా విడుద‌ల కంటే ముందే సూప‌ర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలోని క‌ళావ‌తి పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే మ మా మ‌హేశా పాట‌పై దారుణ‌మైన ట్రోల్స్ కూడా వ‌చ్చాయి.

Advertisement

ఈ పాట‌ను త‌మ‌న్ స‌రైనోడు సినిమా నుండి కాపీ కొట్టాడు అంటూ నెట్టింట ట్రోల్స్ వ‌చ్చాయి. ట్యూన్స్ యాజిటీజ్ గా కాపీ కొట్టేశాడంటూ ట్రోల్స్ వ‌చ్చాయి. దాంతో త‌మ‌న్ తాజాగా నిర్వ‌హించిన సినిమా స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ లో స్పందించారు. సినిమా కోసం మ్యూజిక్ కొడుతున్న స‌మ‌యంలో త‌మ టీమ్ లోని వారికి ఎలాంటి అనుమానం రాలేద‌ని చెప్పారు.

Advertisement

త‌మ‌కెవ‌రికీ అలా అనిపించ‌లేద‌ని దాంతో ఫ్లోలో వెళ్లిపోయామ‌ని చెప్పారు. అంతే కాకుండా త‌న‌కు మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ నుండి చాలా మెసేజ్ లు వ‌చ్చాయ‌ని ఇప్ప‌టి నుండి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాన‌ని చెప్పాడు. అక్క‌డితో ఆగ‌కుండా మ‌హేశ్ బాబు స్టేజ్ మీద డ్యాన్స్ లు వేయ‌డం ఇదే మొద‌టి సారి అని అన్నాడు.

ఆయ‌న క్లాస్ ఆయ‌న‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్ల ఫిగ‌ర్ మాస్ అంటూ కొనియాడారు. అనంత్ శ్రీరామ్ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని అన్నారు. క‌రోనా కంటే ముందే ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ చేశామని చెప్పారు. ఈ సినిమా ఆల్బ‌మ్ క్రెడిట్ ను ద‌ర్శ‌కుడు ప‌ర‌షురామ్ కే ఇస్తాన‌ని అన్నారు. మ‌హేశ్ బాబు మీద ఉన్న అభిమానంతోనే ఆయ‌న ఇలా చేయ‌గ‌లిగాడ‌ని చెప్పారు.

ALSO READ :

Sarkaru Vaari Paata Ott: ఓటీటీలో స‌ర్కారు వారి పాట స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

స‌మంత -నాగ‌చైత‌న్య‌ల‌ను నాగార్జున క‌లుప‌బోతున్నాడా..?

Visitors Are Also Reading