Sarkaru Vaari Paata Ott: వరుస హిట్లతో ఫామ్లో ఉన్న మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీనిని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్గా నటించాడు. భారీ బడ్జెట్తో రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారిపాట సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లో పోటీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ.120 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం.
Sarkaru Vaari Paata Ott Release Date
Sarkaru Vaari Paata Ott
సర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీమూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంబందించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
ఈ సినిమా ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో థియేట్రికల్ రన్పూర్తి అయిన నాలుగు వారాల తరువాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నది.
Also Read :
ఒకే ఫ్రేమ్లో అక్కినేని కుటుంబం.. అక్కడ ఎవ్వరు మిస్ అయ్యారంటే..?
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ.. ఇక ప్రత్యేకత ఏమిటంటే..?