Home » అందుకే వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశారు…త‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

అందుకే వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశారు…త‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం త‌మ‌న్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా రానిస్తున్నారు. బ‌డా సినిమాల‌కు మ్యూజిక్ ఇస్తూ ఫ్యాన్స్ మ్యూజిక్ ట్రీట్ ఇస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన పెద్ద సినిమాలు అన్నీ దాదాపు త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన‌వే కావ‌డం విశేషం. ఇక మే 12న విడుద‌ల కాబోతున్న మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాకు కూడా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన కొన్నిపాట‌లు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. స‌ర్కారు వారి పాట సినిమా ప్రారంభం నుండి స్పార్క్ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని ఫ్యాన్స్ ను ఎక్క‌డా నిరాశ‌ప‌ర్చ‌ద‌ని త‌మ‌న్ వ్యాఖ్యానించారు.

Advertisement

స‌ర్కారువారిపాట సినిమా పాట‌ల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెప్పాడు. కానీ ఒక పాట లీక్ కావ‌డం బాధ‌గా అనిపించింద‌ని చెప్పారు. ఆ పాట‌ను లీక్ చేసింది ఎవ‌రో గుర్తించామ‌ని కానీ స‌ర్కారు వారి పాట నిర్మాత‌లు మాన‌వ‌తా ధృక్ప‌దం తో వ‌దిలేశార‌ని అన్నారు. కెరీర్ నాశ‌నం అవుతుంద‌ని కేవ‌లం వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశార‌ని చెప్పారు. క‌రోనా సంక్షోభంతో టాలీవుడ్ నిర్మాత‌లు ఎంత‌గానో న‌ష్ట‌పోయార‌ని అలాంటి స‌మ‌యంలో ఇలా లీక్ లు ఎలా చేస్తారో అర్థం కాద‌ని అన్నారు. ఎవ‌రైనా స‌రే ఇండ‌స్ట్రీ బాగు కోరుకోవాల‌ని అన్నారు.

ALSO READ :

ఇన్స్టాలో రీఎంట్రీ ఇచ్చిన మెగాడాట‌ర్…ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదంటూ..!

ఆచార్య న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..!

Visitors Are Also Reading