Home » గుడివాడ లో మొదలైన టెన్షన్.. టీడీపీ Vs వైసీపీ..!

గుడివాడ లో మొదలైన టెన్షన్.. టీడీపీ Vs వైసీపీ..!

by Sravya
Ad

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాప అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ లో పొలిటికల్ రగడ స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు గుడివాడలో టీడీపీ రా.. కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా ఈ సభకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హాజర కాబోతున్నారు. ఇంకో పక్క వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు. పోటా పోటీగా ఫ్లెక్సీలను పోస్టర్లు కూడా పెట్టారు.

Advertisement

Advertisement

గుడివాడలో టెన్షన్ వాతావరణం మొదలైంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు రా.. కదలిరా సభ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. పసుపు వర్ణంగా మారిపోయింది ముదినేపల్లి రోడ్డు. భారీగా స్వాగత బ్యానర్లు పెట్టారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఉదయం 11 గంటల కి బైక్ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటలకు అన్న దాన కార్యక్రమాలు కోసం ఏర్పాట్లు చేసారు. ఇలా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ లో రాజకీయ రగడ అయితే మొదలైంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading