Home » గుండు గీయించుకున్న సురేఖ వాణి.. ఈమె భక్తికి ఫిదా అవ్వాల్సిందే..!

గుండు గీయించుకున్న సురేఖ వాణి.. ఈమె భక్తికి ఫిదా అవ్వాల్సిందే..!

by Anji
Ad

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి  అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేని పేరు.. ఈమె ఎన్నో సినిమాల్లో తన కామెడీతో, తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం భార్య పాత్రలో ఈమె చేసిన కామెడీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే అలాంటి సురేఖవాణి కి మంచి ఇమేజ్ వచ్చింది భద్ర, దుబాయ్ శీను, కిక్, బొమ్మరిల్లు  వంటి సినిమాలతోనే. ఇక ఈ ముద్దుగుమ్మ తన కూతురు సుప్రీతతో కలిసి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే సంగతి మనకు తెలిసిందే.

Advertisement

వీరిద్దరూ తల్లీకూతుళ్లలా కాకుండా అక్క చెల్లెళ్లలా ఉంటారు.. ఇక 2019లో సురేఖవాణి భర్త చనిపోవడంతో కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.ఆ తర్వాత మళ్లీ కూతురు సహకారంతో తిరిగి కొద్దిరోజులు సినిమాల్లో చేసింది. అయితే నటి సురేఖావాణి కి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  సురేఖావాణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం సురేఖావాణి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.గతంతో పోల్చి చూస్తే ఆమెకు మూవీ ఆఫర్లు సైతం తగ్గాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈమెకు కరోనా రావడంతో ఈమెకు సినిమాల్లో ఆఫర్స్ తగ్గాయి. అలాగే కొత్త కొత్త నటీమణులు రావడంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయని చెప్పుకోవచ్చు.

Advertisement

ఇక సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా గుండుతో దర్శనమిచ్చిన ఒక ఫోటో నెట్టింట్లో చాలా వైరల్ గా మారుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్ గా తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది. ఇక తిరుమల లో తన తలనీలాలు అర్పించి గుండు గీయించుకుంది సురేఖ వాణి.. అయితే దానికి కారణం సుప్రీత కి సినిమాల్లో అవకాశాలు రావాలని, హీరోయిన్ అవ్వాలని కోరిక కోరుకొని సురేఖ వాణి  ఇలా గుండు గీయించుకుందని ఈమె గుండు ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading