తెలుగు దేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నేడు కీలక తీర్పుని ఇవ్వబోతోంది. ఈ కేసు విషయంలో తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని చెప్పబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన 17 ఏ పిటిషన్ మీద జస్టిస్ అనిరుద్బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పుని ఇవ్వబోతోంది.
Advertisement
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనకి తెలుసు. కాగా ఆయన అరెస్ట్ అయ్యాక రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు పాటు ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద సిఐడి పలు కేసుల్ని నమోదు చేసింది. కేసులు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని కనుక తన మీద పెట్టిన అన్ని కేసులని కూడా క్వాష్ చేయాలని ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!