Home » ‘అత్తారింటికి దారేది’ లోని ఈ సన్నివేశంలో వెనుక నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా !

‘అత్తారింటికి దారేది’ లోని ఈ సన్నివేశంలో వెనుక నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా !

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు వరస సినిమాలతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. బ్రో, హరిహర వీరమల్లు, భగత్ సింగ్, ఇలా వరుస సినిమాలతో.. అటు ఏపీ రాజకీయాల్లో కూడా దూకుడుగా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదంతా పక్కకు పెడితే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో కెరీర్ లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ అందులో అత్తారింటికి దారేది సినిమా కు ప్రత్యేకత ఉంది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ సంచలన దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చింది.

Advertisement

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో మెయిన్ హీరోయిన్ సమంత కాగా, ప్రణీత రెండవ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ హిట్ ను అందుకుంది. అప్పట్లోనే 75 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్ కు అత్తారింటికి దారేది సినిమా.. ఊపిరి పోసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఓ రేంజ్ లో ఉందన్న సంగతి తెలిసిందే.

Advertisement

టాలీవుడ్ నటి నదియా, పవన్ కళ్యాణ్ తో ఫోన్ చేయరా గౌతమ్ అనే షార్ట్ లో ఆమె వెనుక ఓ వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను ఎవరో అనుకుంటే పొరపాటే… అతడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరోజు షూటింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసేoదుకు రాంచరణ్ షూటింగ్ కు వచ్చాడట. ఆ సమయంలో షూట్ జరుగుతుండగా, ఆయన సెట్స్ బయట నిల్చొని ఫోన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడట. అలా ఫ్రేమ్ లో రామ్ చరణ్ కు తెలియకుండానే వచ్చేసాడు. ఈ విషయాన్ని గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పెళ్లి తర్వాత మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?

HEROINES: వ్య‌*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

Visitors Are Also Reading