Home » Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య గురించి తెలియని వారు ఉండరు. అందం, అభినయం, తన నటనతో సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ భామ. సౌందర్య మరణించి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా మనతోనే ఉన్నాయి. సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

Advertisement

ఇద్దరు కన్న పిల్లలు ఒకేసారి కోల్పోయి సౌందర్య తల్లి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. సౌందర్య తల్లిదండ్రులు మంజుల మరియు సత్యనారాయణ. సౌందర్య తల్లి మంజుల చాలా రోజుల పాటు మీడియా ముందుకు రావడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇటీవల కాలంలో ఆమె పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు గాను తాను ఎంతో ఎమోషనల్ అవుతూ సమాధానం ఇచ్చింది.

Advertisement

తనకి ప్రతిరోజు సౌందర్య కలలోకి వస్తుందని… నా మనసు బాగోలేని రోజు నా పిల్లలు ఇద్దరు నా కలలోకి వస్తారని…. ఇక సౌందర్య అయితే నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను కదా అని చెబుతుందని.. కానీ ఆ కల మధ్యలోనే ఎందుకు ఆగిపోతుందని ఎమోషనల్ అయ్యారు నేను ఇంట్లో కాసేపు కనిపించకపోతే సౌందర్య.. అమ్మ ఎక్కడ ఉన్నావు అంటూ ఆమె చుట్టూ తిరిగేదని ఆమె ఎక్కడికైనా వెళ్తే తనకు కూడా నిమిషం కూడా తోచేది కాదని సౌందర్య తల్లి తెలుపుతున్నారు. నాకు ఇప్పటికీ సౌందర్య ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటున్నట్టే ఉంటుంది అని చెప్పారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !

Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !

 

Visitors Are Also Reading