టాలీవుడ్ లో కొంతమంది ముద్దుగుమ్మలు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఆ తరవాత రెండు మూడు సినిమాలు చేసి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అలా మొదటిసినిమాకే హిట్ కొట్టి సినిమాలకు దూరమైన బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
రేణూదేశాయ్ మొదటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. పవన్ కల్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటూ ప్రేమలో పడ్డారు. ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక పవన్ తో పెళ్లి తరవాత రేణూదేశాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పింది.
మహేశ్ బాబు సతీమణి నమ్రత సైతం మొదటి సినిమాతో హిట్ అందుకుంది. కాగా మహేశ్ బాబుకు జోడీగా వంశీ అనే సినిమాలో నటించింది. ఇక మహేశ్ బాబుతో వివాహం తరవాత నమ్రత కూడా సినిమాలకు గుడ్ బై చెప్పింది.
Also Read: తెలంగాణ గ్రూప్-3లో పోస్టులు పెరిగాయి. ఆ పోస్టులను కలపడంతో 1,375కి చేరిన ఖాళీల సంఖ్య!
Advertisement
నువ్వేకావాలి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన రిచా పల్లాడ్ కూడా మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కానీ ఈ సినిమా తరవాత సరైన హిట్ రిచాకు పడలేదు. ఆ తరవాత కొన్ని సినిమాలలో నటించి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంది.
రవితేజ ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరవాత మరికొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం రక్షిత ఓ టీవీ షోకు హోస్ట్ గా చేస్తోంది. అంతే కాకుండా రక్షిత ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
చిత్రం సినిమా హీరోయిన్ రిమాసేన్ కూడా మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తరవాత వరుస ఆఫర్ లు అందుకుంది కానీ సరైన హిట్ అయితే పడలేదు. ఆ తరవాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.
Also Read: టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?