Home » తెలంగాణ గ్రూప్-3లో పోస్టులు పెరిగాయి. ఆ పోస్టులను కలపడంతో 1,375కి చేరిన ఖాళీల సంఖ్య!

తెలంగాణ గ్రూప్-3లో పోస్టులు పెరిగాయి. ఆ పోస్టులను కలపడంతో 1,375కి చేరిన ఖాళీల సంఖ్య!

by Bunty
Ad

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మరో 12 పోస్టులు అదనంగా చేరాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఆధనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసినట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీంతో తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టు 38కి చేరాయి. ఇప్పటికే విడుదలైన గ్రూప్-3 నోటిఫికేషన్ లో 1,363 లను భర్తీ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3 లో పోస్ట్ సంఖ్య 1,375 కి చేరింది.

Advertisement

Advertisement

ఈ మేరకు పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచను ఉన్నట్లు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ పోస్టులకు ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. జనవరి 23న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చింది. డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా జూలై 1, 2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొనివారు గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరపడి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కమిషన్ ఈ సందర్భంగా తెలిపింది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.280లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష మొత్తం మూడు పేపర్లకు కలిపి 450 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

READ ALSO : ప్రాణ స్నేహితుడు చనిపోయినా చూడటానికి వెళ్ళని రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

Visitors Are Also Reading