Home » టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

by Bunty
Ad

మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటుడు నాగార్జున, సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అనే విషయం అందరికీ తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన పరపతిని ఉపయోగించుకోలేదు.

Advertisement

 

తన సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలో దూసుకెళ్లారు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా అక్కినేని నాగార్జున కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉండగా, నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి ఎందుకు వెళ్లడని చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో, అలాగే సోషల్ మీడియాలోనూ జరుగుతోంది. కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కొంత కామెంట్స్ వినిపించాయి.ఆయన కుటుంబంలో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు కన్ను మూసిన, ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ కన్నుమూసిన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది.

Advertisement

కానీ నాగార్జున ఎందుకు ఎవరు మృతి చెందిన ఆఖరి చూపుకు వెళ్లడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్లింది అంటే ఒక్క దాసరి ఇంటికి మాత్రమే. దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోతే ఆ తర్వాత మూడో రోజు వెళ్లి దాసరిని కలవడం జరిగింది. అయితే అదే సమయంలో నాగార్జునకి సంబంధించిన సినిమా ఒకటి ఆగిపోవడం వల్లనే వెళ్లి కలిసి పనిలో పనిగా పరామర్శించాడు. నాగార్జున సంగతి పక్కన పెడితే, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ మాత్రం నాగార్జున వైఖరిని పూర్తిగా వారు విభిన్నమని చెప్పుకోవచ్చును. నాగార్జున కు తన పనులు తప్ప… ఇంకా ఎవరి గురించి పట్టదని, ఈ విషయం పై వేలెత్తి చూపుతున్నారు.

Read Also : ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46లక్షలు కాజేసిన కిలేడి

Visitors Are Also Reading