Home » నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై… శ్రీరెడ్డి ఫైర్.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ…!

నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై… శ్రీరెడ్డి ఫైర్.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ…!

by Sravya

చంద్రబాబు నాయుడు అరెస్టు అవడంతో, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. నారా బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడారు. ఎలాంటి ప్రూఫ్ లేకుండా చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేశారని చెప్పారు ఆమె. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన స్కీమ్స్ ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. వాళ్ళలో నేను కూడా ఒకదానినే. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి ఆయనని అరెస్ట్ చేయడం ని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా బ్రాహ్మణి చెప్పారు.

చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయడంతో, లోకేష్ ఢిల్లీ వెళ్లారు. రాజమండ్రి విజయవాడ మధ్య నేను తిరుగుతున్నాను. ఎప్పుడు బయటికి రాని అత్తమ్మ కూడా బయటకి వచ్చారు ఎనిమిదేళ్ల నా కొడుకు దేవాన్ష్ ఒంటరిగా ఉంటూ స్కూల్ కి వెళ్తున్నాడు. కుటుంబం మొత్తాన్ని కూడా బాధ పెడుతున్నారని బ్రాహ్మణి మాట్లాడారు. బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో కొడుకు ఒంటరిగా ఉంటున్నాడని నువ్వు బాధ పడిపోతున్నావు.

తాత అవసరం తనకి లేకపోవచ్చు కానీ ఒకప్పుడు జగన్ అన్న అరెస్టయ్యారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి. మరి అప్పుడు ఆయన పరిస్థితి నువ్వు ఆలోచించలేదా అని శ్రీరెడ్డి అన్నారు. ఎప్పుడు బయటికి రాని మా అత్త బయటకి వచ్చిందని నువ్వు చెప్తున్నావు మీడియా అంటే కూడా తెలియని విజయమ్మ ఆరోజు కొడుకు కోసం రోడ్డుపైకి రాలేదా..? ఆరోజు నువ్వేం చేసావని ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి. పైగా తండ్రిని జైల్లో పెడితే ఆడపిల్లలందరూ నడిరోడ్డు మీద కూర్చుంటే పోలీసులు చేత వాళ్ళని పక్కకి లాగేసారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబు గురించి ఇంతలా మాట్లాడుతున్నావు. అవినీతి చేసేటప్పుడు ఇది చేయడం తప్పు మావయ్య అని ఒక్క మాట చెప్పవా అని శ్రీరెడ్డి బ్రాహ్మణి పై ఫైర్ అయింది.

Also read:

Visitors Are Also Reading