Home » సౌంద‌ర్య వెంక‌టేష్ ల మ‌ధ్య అలాంటి రిలేష‌న్షిప్ ఉండేదా..? వెంక‌టేష్ ను ఏమ‌ని పిలిచేవారంటే..?

సౌంద‌ర్య వెంక‌టేష్ ల మ‌ధ్య అలాంటి రిలేష‌న్షిప్ ఉండేదా..? వెంక‌టేష్ ను ఏమ‌ని పిలిచేవారంటే..?

by AJAY
Ad

విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. నిర్మాత రామానాయుడు త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంక‌టేష్ సొంత బ్యాన‌ర్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. అంతే కాకుండా త‌న బ్యాన‌ర్ కు వెంక‌టేష‌న్ లాభాలు కూడా తెచ్చిపెట్టారు. ఇక వెంక‌టేష్ మంచి మ‌న‌సు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎంతో జోవియ‌ల్ గా ఉంటారు.

Advertisement

వెంక‌టేష్ ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించ‌గా ఆయ‌న ఎక్కువ సినిమాల‌ను హీరోయిన్ సౌంద‌ర్య‌తో చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన రాజా, ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, దేవిపుత్రుడు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ లు అయ్యాయి. వీరిద్ద‌రి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్క్రీ చాలా బాగా పండింది. అయితే నిజ‌జీవితంలో వీరిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఎలా ఉండేదో వెంక‌టేష్ మ్యాక‌ప్ మ్యాన్ రాఘ‌వ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Advertisement

heroine-soundarya

వెంక‌టేష్ చాలా స‌ర‌దాగా ఉంటార‌ని కానీ చాలా త‌క్కువ మాట్లాడ‌తార‌ని రాఘ‌వ తెలిపారు. వెంక‌టేష్ పై ఏ హీరోయిన్ తో కూడా రూమ‌ర్స్ లేవ‌ని అన్నారు. సౌంద‌ర్య‌తో వెంక‌టేష్ అన్ని సినిమాలు చేసినా కూడా ఆవిడ అంటే ఎంతో అభిమానం ఉండేద‌ని చెప్పారు. అంతే కాకుండా చాలా సినిమాలలో క‌లిసి న‌టించినా సౌంద‌ర్య వెంక‌టేష్ ను సార్ అని పిలిచేద‌ని చెప్పారు.

అంతే కాకుండా తాము బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు సౌంద‌ర్య త‌మ‌ను ఇంటికి ఆహ్వానించి స్వ‌యంగా వండి తానే వ‌డ్డించిందని తెలిపారు. సౌంద‌ర్య చాలా మంచి అమ్మాయి అని హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో చనిపోయిన్పుడు వెంక‌టేష్ చాలా బాధ‌ప‌డ్డార‌ని రాఘ‌వ వెల్ల‌డించారు.

ALSO READ : తగ్గేదేలే.. ‘జనసేన’ కండువాలతో పెళ్లి..ఫోటోలు వైరల్ !

Visitors Are Also Reading