ప్రముఖ టాలీవుడ్ నటి సౌందర్య మరణించి చాలా ఏళ్లు అయినప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా ఆమె ఇంకా జీవించే ఉన్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉన్న సౌందర్య తన సినిమాల ద్వారా పాపులర్ కావడంతో పాటు తన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలకు దగ్గరయ్యాడు. సౌందర్య మేనకోడలు తాజాగా ఓ సందర్భంలో మరణించడానికి ముందు సౌందర్య చెప్పిన విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. చిన్న వయస్సులోనే సౌందర్య మరణించగా.. ఆమె మరణం వల్ల కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.
Advertisement
మరికొన్ని సినిమాల్లో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లేకుండానే సినిమాలు విడుదలయ్యాయి. చిన్న వయస్సులోనే 100కి పైగా సినిమాల్లో ఆమె నటించారంటే ప్రేక్షకుల్లో ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదని కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. సౌందర్య మేనకోడలు మాట్లాడుతూ తనతో చివరిసారి మాట్లాడిన సమయంలో సౌందర్య కుంకుమ, కాటన్ చీరలు కావాలని అడిగారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో కాటన్ చీర ధరించి పాల్గొంటే.. బాగుంటుందని భావించి సౌందర్య ఆవిధంగా చేశారని సమాచారం.
Advertisement
మేనకోడలు నిర్మలను ఓ కాటన్ చీర కచ్చితంగా కొనాలని తన దగ్గర ఒక్క కాటన్ చీర కూడా లేదనే ఆమె చెప్పినట్టు సమాచారం. ఇక అదే సమయంలో నుదుటన పెట్టుకునే కుంకుమ కూడా కావాలని సౌందర్య మేనకోడలిని కోరారట. ఆ తరువాత ఫ్లైట్ లో ఎక్కిన సౌందర్య ప్రమాదంలో మృతి చెందారు. సౌందర్య తరువాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయిపల్లవిని ఒకరని చెప్పవచ్చు. సౌందర్య స్థాయి నటీమణి మరొకరు లేరని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ జనరేషన్ లో కూడా సౌందర్యను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?