Home » ఒకే టైటిల్ తో వచ్చిన బాలకృష్ణ, శోభన్ బాబు.. ఎవరి సినిమా హిట్ అయ్యిందో తెలుసా..?

ఒకే టైటిల్ తో వచ్చిన బాలకృష్ణ, శోభన్ బాబు.. ఎవరి సినిమా హిట్ అయ్యిందో తెలుసా..?

by Azhar
Published: Last Updated on
Ad

ప్రస్తుతం మనం టాలీవుడ్ లో విడుదలైన సినిమా పేర్లను చూస్తుంటే.. అందులో చాలా వరకు ఒక్కపుడు విడుదలై మంచి విజయం సాధించిన సినిమా పేర్లను ఇప్పుడు పెట్టుకుంటున్నారు.

Advertisement

అయితే ఒక్క సినిమా విడుదలైన తర్వాత దాదాపు 12 ఏళ్ళు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు ఉపయోగించకూడదు. కానీ ఆ తర్వాత వాడుకోవచ్చు. అయితే ఇలా ఒక్కే పేరుతో రెండు సినిమాలు రావడం ఇప్పుడే కాదు అపట్లో కూడా జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్లు శోభన్ బాబు, బాలకృష్ణ ఒక్కే సినిమా పేరుతో వచ్చారు. మరి అందులో ఏ సినిమా హిట్ అయ్యిందో చూద్దాం..!

మొదట 1970 లో శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే సినిమా విడుదల అయింది. ఇందులో శోభన్ బాబుకు జంటగా చంద్రకళ నటించింది. అలాగే ఆయాకు తల్లిగా మహానటి సావిత్రి గారు కనిపించగా… తండ్రి పాత్రలో జగ్గయ్య గారు నటించారు. అయితే కుటుంబం కంటే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే జగ్గయ్య గారి నుండి సావిత్రి తన కొడుకు తీసుకొని దూరం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ కొడుకు శోభన్ బాబు కాగా.. చివర్లో వీరు మళ్ళీ ఎలా కలిశారు అనేదే కథ..! ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేదు. అందుకే యావరేజ్ గా నిలిచింది.

Advertisement

ఇక 1991 లో మళ్ళీ అదే తల్లిదండ్రులు టైటిల్ తో బాలకృష్ణ, విజయశాంతి జంటగా కనిపించిన సినిమా వచ్చింది. ఈ సినిమాకు తాతినేని రామారావు డైరెక్షన్ చేసారు. అయితే ఓ ఉమ్మడి కుటుంబంలో పుట్టిన బాలకృష్ణ పని ఎం చెయ్యకుండా.. డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ఇక ఓ డ్యాన్స్ టీచర్ గా పనిచేసే విజయశాంతికి ఈయనకు అసలు పడద్దు. కానీ ఆ తర్వాత వీరు ప్రేమలో ఎలా పడుతారు.. బాలయ్య కుటుంబం గురించి తెలుసుకొని ఎలా మారుతారు అనేది కథ. అయితే ఈ సినిమా అన్ని రకాల అభిమానులను అలరించడంతో సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :

విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?

ఆసియా కప్ పై లంక బోర్డు కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading