Home » క్యాన్సర్ తో పోరాడిన నటి సుభాషిణి….యాంకర్ సుమతో పాటు ఆ ఇద్దరు స్టార్ హీరోల వల్లే బ్రతికిందట….!

క్యాన్సర్ తో పోరాడిన నటి సుభాషిణి….యాంకర్ సుమతో పాటు ఆ ఇద్దరు స్టార్ హీరోల వల్లే బ్రతికిందట….!

by AJAY
Ad

అల్లరి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల్లో సుభాషిని కూడా ఒకరు. మొదట సుభాషిని నాటక రంగంలో రాణించారు. చింతామణి నాటకం ద్వారా ఆమె ఎంతో ఫేమస్ అయ్యారు. కాగా టాలీవుడ్ నటుడు చలపతి రావు ద్వారా అల్లరి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చలపతిరావు కొడుకు రవిబాబు అల్లరి సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలా రవిబాబు సినిమాలో సుభాషిణికి చలపతిరావు ఛాన్స్ ఇప్పించారు. అలా అల్లరి సినిమాలో సుభాషిని చాన్స్ అందుకుని తన నటనతో ఆకట్టుకుంది.

Advertisement

ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఈశ్వర్, బెండప్పారావు, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. వీటితో పాటు అనేక చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. కాగా కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే సుభాషిని క్యాన్సర్ భారిన పడ్డారు. ప్రస్తుతం క్యాన్సర్ నుండి కోలుకున్న సుభాషిని ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిణి సహాయంతో తను బాలకృష్ణను సంప్రదించినట్టు తెలిపారు. దాంతో బసవతారకం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని అన్నారు. క్యాన్సర్ కు మొదట 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.

Advertisement

కానీ తెలిసిన వారిద్వారా ప్రభుత్వం సహాయం అందడంతో కేవలం ఐదు వేల రూపాయల్లో చికిత్స పూర్తయిందని చెప్పారు.ఇక తన ఆర్థిక పరిస్థితి గురించి యాంకర్ సుమకు వివరించగా ఆమె ప్రతి ఆరు నెలలకు ఒకసారి అమెరికా కు సంబంధించిన ఓ సంస్థ ద్వారా ఉచితంగా మందులను ఇప్పిస్తున్నారని తెలిపారు. ఆ మందులు బయట తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు. అంతేకాకుండా చిరంజీవితో ఫోన్ మాట్లాడగా ఆయన సినిమా అవకాశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.

ముందుగా ఆరోగ్యం చూసుకోండి పూర్తిగా కోరుకున్న తర్వాత కచ్చితంగా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా సుభాషిని తాను ఓ సీరియల్ కు నిర్మాతగా వ్యవహరించానని చెప్పారు. ఆ సీరియల్ కోసం చాలా ఖర్చు చేశానని అన్నారు. అయితే ఆ సీరియల్ ఇంకా విడుదల అవ్వలేదని సీఎం జగన్ సహకరిస్తే దూరదర్శన్ లో ఆ సీరియల్ ను విడుదల చేస్తామని అన్నారు. ఆ సీరియల్ విడుదలవుతే తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని చెప్పారు.

Visitors Are Also Reading