Home » టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్ టూర్ కు రాహుల్ డౌటే..!

టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్ టూర్ కు రాహుల్ డౌటే..!

by Anji
Ad

ఇంగ్లాండ్ తో గత ఏడాది అర్ధాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, మహమ్మద్ షమీ లతో కూడిన భారత జట్టు రేపు లండన్ ఫ్లైట్ ఎక్కల్సి ఉన్నది. ఈ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమే అని తెలుస్తుంది. రాహుల్ రేపు ఇంగ్లాండ్ కు బయలుదేరాలి ఉన్నా.. అతను ఇంకా జాతీయ క్రికెట్ అకాడమీ లోనే ఉండడం విశేషం.

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా..జులై ఒకటో తేదీ నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న ఏకైక టెస్ట్ కోసం పంతు, లో శ్రేయస్ అయ్యర్ తప్ప టీమిండియా మొత్తము రేపు లండన్ ఫ్లైట్ ఎక్కనున్నది. ఇంగ్లాండ్ కార్యక్రమంలో భారతదేశం మ్యాచ్ తో పాటు 3 వన్డే 3 t-20 సిరీస్ లు కూడా ఉన్నాయి. మరొకవైపు టీమ్ ఇండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సమయంలోనే భారత్ ఐర్లాండ్ లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. హార్దిక్ పాండ్యా ఈ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీం ఇండియాను ప్రకటించాల్సి ఉన్నది. జులై 07 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్లు జరగనున్నాయి.

 

Visitors Are Also Reading